ఏపీలో కొవిడ్ టీకా పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా
సుమారు 90 లక్షల మందికి మార్చి 1 నుంచి టీకా ఇవ్వనున్నారు. 60 ఏళ్లు దాటిన
వారిలో ప్రతి ఒక్కరికీ.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు
పైబడిన వారికి కూడా టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. దీర్ఘకాలిక వ్యాధులు
ఉన్నట్లు, గుర్తింపు పొందిన వైద్యులు ఇచ్చే సర్టిఫికేట్ ఆధారంగా టీకా
ఇస్తారు. దీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో 20 రకాలను చేర్చారు. ఏపీలో 1,658
ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా, 564 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజు తీసుకొని
టీకా పంపిణీ చేయనున్నారు. కొవిన్ యాప్లో ముందస్తు పేర్లు నమోదు చేసుకున్న వారితో పాటూ.. పంపిణీ
కేంద్రాలకు వెళ్లిన వారికి కూడా టీకా వేస్తారు. టీకా వేసేందుకు ‘కొవిన్
1.0’ యాప్ను ‘కొవిన్ 2.0’గా అప్గ్రేడ్ చేస్తారు. రాష్ట్రంలో ఇప్పటివరకు
రిజిస్ట్రేషన్లు జరిగిన 4 లక్షల మంది ఆరోగ్య సిబ్బందిలో 67% మంది మొదటి
డోసు టీకా ఇచ్చారు. ఇతర శాఖల ఉద్యోగులు 6 లక్షల మంది ఉంటే వీరిలో 35% మంది
వరకు మొదటి డోసు టీకా తీసుకున్నారు. ఆరోగ్య సిబ్బందిలో 1.40 లక్షల మంది
రెండో డోసూ పొందారు. సోమవారం నుంచి కొవిన్ యాప్లో టీకా అవసరమైన వారు
పేర్లు నమోదు చేసుకొనే అవకాశాన్ని కల్పించబోతున్నారు.
కొవిన్
యాప్లో యాప్లో రాష్ట్రంలోని 2,222 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు,
కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల వివరాలు ఉంటాయి. ఆరోగ్యసేతు యాప్ ద్వారా కూడా
రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. యాప్లో ఉండే ఆస్పత్రులు, సమయాన్ని అనుసరించి
టీకా పొందేందుకు వివరాలు నమోదు చేసుకోవచ్చు. పేరు, వయసు, పురుషులు/మహిళలు,
పంపిణీ కేంద్రం, సమయాన్ని కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాల నమోదు
జరిగిన వెంటనే స్లాట్ కేటాయిస్తారు.. ఆ తర్వాత మొబైల్కరు మేసేజ్ కూడా
వస్తుంది. యాప్లో ముందస్తుగా వివరాలు నమోదు చేయకున్నా వ్యాక్సిన్
తీసుకోవచ్చు. సంబంధిత కేంద్రంలో ఆ రోజు టీకా వేయించుకునే వారు తక్కువ మంది
ఉంటే అవకాశం కల్పిస్తారు. అయితే దీనికి ముందు వివరాల నమోదు తప్పనిసరి. టీకా
తీసుకోగానే రెండో డోసు ఎప్పుడు వేయించుకోవాలనే సమాచారం వస్తుంది.
ప్రాధాన్య క్రమంలో తొలి డోసు పొందిన 29 రోజుల నుంచి 42 రోజుల్లోగా రెండో
డోసు ఇస్తారు. ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న టీకాను పంపిణీ చేస్తారు.
వివరాలు
నమోదు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ స్లిప్, టోకెన్ ఇస్తారు. యాప్లో
స్లాట్కు సంబంధించి స్లిప్ డౌన్లోడు చేసుకొనే అవకాశాన్నీ కల్పిస్తారు.
ఫోన్కు వచ్చిన సంక్షిప్త సమాచారాన్ని పంపిణీ కేంద్రాల్లో చూపించినా టీకా
వేస్తారు. ఇక ఆధార్ కార్డ్, ఫోటో ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్,
పాస్పోర్టు, ఫొటోతో ఉన్న పింఛను డాక్యుమెంట్, ఎన్పీఆర్ కార్డు వంటివి
గుర్తింపుకార్డుగా తీసుకెళ్లొచ్చు.
ఏపీలో మార్చి 1 నుంచి వ్యాక్సిన్..