రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కొన్ని రైల్వే స్టేషన్లలో
ప్లాట్ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి రూ.30కి పెంచుతూ రైల్వేశాఖ
నిర్ణయించింది. రైల్వే స్టేషన్లలో పోస్టర్లు అతికించి అవగాహన
కల్పిస్తున్నారు. ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్టేషన్లలో
రద్దీని తగ్గించడానికి తాత్కాలిక ప్రాతిపదికన ఈ చర్య తీసుకున్నట్లు
రైల్వేశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి
రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు
తెలిపింది. గతంలో
అప్పుడప్పుడూ ఛార్జీలను అమలు చేస్తున్నామని రైల్వేశాఖ చెబుతోంది. కొన్ని
రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరిగిపోతుండటంతో అవసరమైన వారు మాత్రమే
వచ్చేలా ఈ నిర్ణయం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సాధారణంగా రూ.10
ఉన్న ప్లాట్ఫామ్ టికెట్ను శనివారం నుంచి విజయవాడ రైల్వే స్టేషన్లో ఇకపై
తాత్కాలికంగా రూ.30 వసూలు చేయనున్నారు. స్పెషల్ రైళ్లన్నింటికీ ఇది
వర్తిస్తుంది.. విజయవాడతో పాటు డివిజన్ పరిధిలోని తెనాలి, ఒంగోలు,
నెల్లూరు, గూడూరు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ టౌన్, భీమవరం
స్టేషన్లలో కూడా రూ.30 చెల్లించాలి.
అలాగే రాష్ట్రంలోని భీమవరం,
తాడేపల్లిగూడెం, నిడదవోలు, కాకినాడ పోర్టు, అన్నవరం, తుని, అనకాపల్లి,
కొవ్వూరు, గోదావరి, అనపర్తి, పిఠాపురం, నర్సీపట్నం, ఆకివీడు, చీరాల,
వేదాయపాలెం, బిట్రగుంట, కావలి, పవర్పేట, కైకలూరు, పెడన, మచిలీపట్నంలలో
రూ.20 ప్లాట్ఫామ్ టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు ఈ
మార్పులును గమనించాలంటోంటి రైల్వేశాఖ.
రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధర..₹ 30