RBI లో 841 ఆఫీస్‌ అటెండెంట్‌ పోస్టులు..

 (RBI) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 841 ఆఫీస్‌ అటెండెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ మొత్తం పోస్టుల్లో 57 పోస్టులు హైదరాబాద్‌ కేంద్రంలోనూ ఖాళీ ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు ఫిబ్రవరి 24 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 15 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https;//www.rbi.org.in/  వెబ్‌సైట్‌ చూడొచ్చు.

పూర్తి వివరాలు:

  • మొత్తం ఖాళీలు: 841
  • అర్హత: పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ/మెట్రిక్యులేషన్‌) ఉత్తీర్ణత ఉండాలి. ఫిబ్రవరి 1, 2021 నాటికి అండర్‌ గ్రాడ్యుయేట్‌గా ఉండాలి. గ్రాడ్యుయేట్లు, ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
  • వయసు: ఫిబ్రవరి 1, 2021 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
  • ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (ఎల్‌పీటీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరే ఇతర పద్ధతిలోనూ అప్లికేషన్లు స్వీకరించరు.
  • దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/జనరల్‌ అభ్యర్థులు రూ.450, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.50 చెల్లించాలి.
ముఖ్యతేదీలు:
  • దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 24, 2021
  • దరఖాస్తుకు చివరితేది: మార్చి 15, 2021
  • పరీక్ష తేదీ: 2021, ఏప్రిల్‌ 9, 10 తేదీల్లో పరీక్ష ఉంటుంది.
  • వెబ్‌సైట్‌:https;//www.rbi.org.in/