ఏపీ పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ షాకిచ్చారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవ ఎన్నికలపై అనుమానం
వ్యక్తం చేశారు.. సమగ్ర నివేదిక ఇవ్వాలని రెండు జిల్లాల కలెక్టర్లను ఎస్ఈసీ
ఆదేశించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని.. ఆ రెండు జిల్లాల్లో
ఏకగ్రీవాలను ప్రకటించొద్దని ఆదేశించారు. మిగిలిన 11 జిల్లాలలో ఏకగ్రీవాలు
సాధారణంగానే ఉన్నాయన్నారు. మొదటి విడత ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో 110,
గుంటూరు జిల్లాలో 67 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవాలను గుడ్డిగా
ఆమోదించొద్దని ఎస్ఈసీ చెబుతోంది.. మొదటి దశ ఎన్నికల్లో ఎక్కువ ఏకగ్రీవాలు
చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఉండటంతో ట్విస్ట్ ఇచ్చారు.
పంచాయతీ
ఎన్నికల తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారంతో ముగిసింది.
రాష్ట్రంలో మొదటి దశలో 3249 పంచాయితీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 453
పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా
చిత్తూరులో అత్యధికంగా 110 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. రాజధాని అమరావతి
ప్రాంతం ఉన్న గుంటూరు జిల్లాలో 67 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కర్నూలు
జిల్లాలో 54, వైఎస్ఆర్ కడప జిల్లాలో 46, శ్రీకాకుళం జిల్లాలో 34,
పశ్చిమగోదావరి జిల్లాలో 40, విశాఖ జిల్లాలో 32, ప్రకాశం జిల్లాలో 16,
కృష్ణా జిల్లాలో 20, తూర్పుగోదావరి జిల్లాలో 28 ఏకగ్రీవం అయ్యాయి.
ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ ట్విస్ట్..