ఏపీలో ఉగాది పండుగ సందర్భంగా గ్రామ, వార్డు వాలంటీర్లకు ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి అదిరిపోయే బహుమతులు ప్రకటించారు. ఉగాది నుంచి అన్ని
నియోజకవర్గాల్లో వాలంటీర్లను సత్కరించాలని.. సేవా రత్న, సేవా మిత్ర, సేవా
వజ్ర వంటి బిరుదులు ఇవ్వాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా వారి సేవల్ని
గుర్తించి, ప్రోత్సహించినట్లు అవుతందన్నారు. వాలంటీర్లకు రివార్డుతో కూడిన
అవార్డులు ఇవ్వాలన్నారు. తమ బాధ్యతలను ఉద్యోగంగా భావించకుండా, సేవా
దృక్పథంతో పని చేస్తారన్నారు. వాలంటీర్ల సేవలను గుర్తించేలా ఉగాది రోజున ప్రోత్సాహకాలతో వారిని
గౌరవించాలన్నారు. మొత్తం మూడు కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు
ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వాలంటీర్లు అందించే సేవలను బట్టి మూడు
కేటగిరీలుగా ఎంపిక చేసి.. ఉగాది నుంచి వాలంటీర్ల పురస్కారాల కార్యక్రమం
నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో తాను ఈ
కార్యక్రమాలకు హాజరవుతానని ప్రకటించారు.
ఉగాది సందర్భంగా
వాలంటీర్లకు అందించే పురస్కార కార్యక్రమం వివరాలను అధికారులు వివరించారు.
మొత్తం మూడు కేటగిరీల్లో పురస్కారాల ఎంపికకు నిర్దేశించిన అర్హతలను
నిర్ణయించారు. గ్రామ, వార్డు వాలంటీర్లకు మూడు కేటగిరీల్లో అవార్డులు, నగదు
పురస్కారాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సచ్ఛీలత, మూడు రోజుల్లోగా
పెన్షన్ల పంపిణీ, హాజరు, యాప్ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం,
కోవిడ్ –19 సర్వే వంటి అంశాలు ఎంపికకు ప్రామాణికంగా తీసుకుంటారు.
వాలంటీర్లు అందించే సేవలను బట్టి మూడు కేటగిరీలుగా ఎంపిక చేసి.. ఉగాది
నుంచి వాలంటీర్ల పురస్కారాల కార్యక్రమం నిర్వహించనున్నారు.
1వ
కేటగిరి కింద ఏడాది పాటు నిరంతరంగా సేవలు అందించిన వారందరి పేర్లు
పరిశీలిస్తారు. ఇందులో ఎంపికైన గ్రామ, వార్డు వాలంటీర్లకు సేవామిత్ర
పురస్కారం, బ్యాడ్జ్, రూ.10 వేల నగదు బహుమతి అందజేస్తారు.
2వ
కేటగిరిలో ప్రతి మండలం, పట్టణంలో ఐదుగురు చొప్పున వాలంటీర్ల ఎంపిక. వీరికి
సేవా రత్న పురస్కారం, స్పెషల్ బ్యాడ్జ్, రూ.20 వేల చొప్పున నగదు బహుమతి
అందిస్తారు.
3వ కేటగిరిలో ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున
వాలంటీర్ల ఎంపిక. వీరికి సేవా వజ్రం పేరిట పురస్కారం, స్పెషల్ బ్యాడ్జ్తో
పాటు మెడల్, రూ.30 వేల చొప్పున నగదు పురస్కారం ఇస్తారు.
ఏపీలో వాలంటీర్లకు ఉగాది పురస్కారలు..