తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఆధ్యాత్మిక నగరానికి తొలి మేయర్ ఎవరు అవుతారనేది ఉత్కంఠగా రేపుతోంది. తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగడానికి ముందు జరుగుతున్న ఉప ఎన్నికలకు ప్రాధాన్యం మరింత పెరిగింది. తిరుపతి కార్పొరేషన్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న అధికార వైఎస్సార్సీపీ.. మేయర్ అభ్యర్థిని ఖరారు చేసింది. డాక్టర్ శిరీషను మేయర్ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. 27వ డివిజన్ నుంచి 2020 మార్చిలో ఆమె కార్పొరేటర్గా నామినేషన్ దాఖలు చేశారు.
ఇతరులెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిరుపతి మేయర్
పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కాగా.. మేయర్ అభ్యర్థిత్వం కోసం అధికార
పార్టీలో చాలా మంది ఆశావహులు ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్
రెడ్డితో చర్చించిన పార్టీ పెద్దలు శిరీష పేరును ఖరారు చేశారని
తెలుస్తోంది. త్వరలోనే చిత్తూరు మేయర్ అభ్యర్థి విషయంలోనూ వైసీపీ క్లారిటీ
ఇచ్చే అవకాశం ఉంది.