మాస్క్ వాడుతున్నారా,ఈ జాగ్రత్తలు పాటించండి..


ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఫేస్ మాస్క్ వాడుతున్నారు. ఇది మంచిది కాదని కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలుసుకోండి..



కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ వాడుతున్నారు. దీని వల్ల కరోనా నుంచి బయటపడుతున్నారని భావిస్తున్నారు అయితే, మంచితో పాటే చెడు కూడా ఉన్నట్లు ఈ మాస్క్ వల్ల మేలు ఎంత జరుగుతుందో నష్టం కూడా అంతే జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.


అవునండి.. ఇదేదో ఊరికే చెబుతున్నది కాదు. దీనిని వాడడం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటిని దూరం చేసుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అసలు ఈ ఫేస్ మాస్క్ ఎప్పుడు ప్రమాదకరం.. దీనిని ఎందుకు వాడకూడదో తెలుసుకోండి..


ఫేస్ మాస్క్ ఎప్పుడు కూడా కాసేపే ధరించాలి. అలా కాకుండా మాస్క్ ఎప్పుడూ కొంతసేపు మాత్రమే ధరించాలి. చాలా సేపు మాస్క్ ఉంచుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే.


1. రక్తం లో ఆక్సిజన్ తగ్గిపోతుంది.  2. మెదడుకి కావాల్సినంత ఆక్సిజన్ సరఫరా జరగదు.


3. నీరసంగా అనిపిస్తుంది.   4. మరణం కూడా సంభవించవచ్చు.


ఇలా జరగుకుండా ఉండాలంటే ఏం చేయాలో నిపుణులు ఏం చెబుతున్నారంటే..


*. ఒక్కరే ఉన్నప్పుడు మాస్క్ తీసెయ్యండి.
కొంతమంది ఒక్కరే ఉన్నప్పుడు కూడా మాస్క్ వాడుతున్నారు.. ఇది అవసరం లేదని చెబుతున్నారు. మీరు ఒకరినుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మాస్క్ వాడండి.. అంతేకానీ, ఒక్కరు ఉన్నప్పుడు అవసరం లేదు. జన సమూహాల్లో బయటికి వెళ్లినప్పుడు మాత్రమే మాస్క్ వాడండి. 


*. ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ అవసరం లేదు.
*. ప్రజలు గుంపుగా ఉన్న ప్రదేశానికి మీరు వెళ్ళినప్పుడూ, ఎవరితోనైనా దగ్గరగా ఉన్నప్పుడూ మాత్రమే మాస్క్ ధరించండి.
*. మీరు ఒంటరిగా ఉంటే మాస్క్ వేసుకోవాల్సిన ఆవశ్యకతను బాగా తగ్గించవచ్చు. 


అతి జాగ్రత్తల వల్లే లేనిపోని సమస్యలు వస్తాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.